NLG: కనగల్ మండలం దర్వేశపురం ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని ఎల్లమ్మ తల్లిని కోరుకున్నారు. దేవస్థానం అభివృద్ధిపై పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.