HYD: జలమండలి మరో పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆర్టీఐ కేసుల్లో ఉత్తమ సేవలకు తెలంగాణ సమాచార కమిషన్ ఉత్తమ హెడ్ ఆఫ్ డిపార్ట్ మెంట్ జలమండలికి పురస్కారాన్ని ప్రకటించింది. గురువారం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అవార్డును అందుకున్నారు.