AP: గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అన్నపర్రు బీసీ సంక్షేమ బాలుర హాస్టల్లో 16 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని పెదనందిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఫుడ్ పాయిజన్ అయినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.