SRPT: కార్మిక సమస్యలను మేనేజ్మెంట్ వెంటనే పరిష్కరించాలని సిమెంట్ క్లస్టర్ పరిశ్రమ వర్కర్స్ యూనియన్(CITU) జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీను అన్నారు. ఇవాళ మేళచెరువు మండల పరిధిలోని రామపురం గ్రామంలో తీగల శ్రీను అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా కన్వీనర్ సైదులు, యూనియన్ కార్యదర్శి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.