ప్రకాశం: తర్లుపాడు మండలం, తుమ్మలచెరువు గ్రామంలో శుక్రవారం ‘ఆత్మ’ సంస్థ సహకారంతో కంది పంటపై ఫాం స్కూల్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించి, అధిక దిగుబడులు సాధించేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యంమని మండల వ్యవసాయ అధికారిని జోష్నాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు.