ADB: నిరుపేద గిరిజన ఆదివాసీ విద్యార్థులను ప్రభుత్వం ఆదుకోవాలని సంక్షేమ పరిషత్ విద్యార్ధి సంఘం మండలాధ్యక్షుడు జాలింషావ్ అన్నారు. శుక్రవారం నార్నూర్ మండల కేంద్రంలోని కొమురంభీం చౌక్ ఎదుట మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ఎంపికైన విద్యార్థులకు స్కాలర్షిప్ రాక ఫీజు చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు.