AKP: రావికమతంలో కొత్తగా నిర్మించిన తులసి కళ్యాణ మండపాన్ని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ శుక్రవారం ప్రారంభించారు. విశాఖ డెయిరీ సహకారంతో దీనిని నిర్మించారు. ఈ ప్రాంత ప్రజల కోసం నిర్మించిన దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు. ఈ కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎస్ఎస్ రాజు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆడారి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.