SRD: పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టుకు సోమవారం మళ్లీ వరద పెరిగింది. ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి 22 వేల క్యూసెక్కుల వరద ప్రాజెక్టులో చేరుతున్నట్లు ఇరిగేషన్ DEE నాగరాజ్ తెలిపారు. వరద ప్రవాహం దృష్ట్యా ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 28,768 క్యూసెక్కులు దిగువకు వదిలినట్లు చెప్పారు. మంజీర నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.