BDK: మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు రైల్వే పోలీసులు బుధవారం కొత్తగూడెం రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికుల సామానులను పరిశీలించి, అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. మాదకద్రవ్యాలు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.