BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో మే 1న మేడే కార్మిక దినోత్సవం జరపనున్నట్లు భవన నిర్మాణ కార్మిక మండల అధ్యక్షుడు పసుల రాకేశ్ వెల్లడించారు. హనుమాన్ ఆలయం వద్ద కార్మిక జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. గ్రామస్థులు, రాజకీయ నాయకులు, భవన నిర్మాణ, ఆటో, ట్రాక్టర్ యూనియన్ కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.