మహబూబ్ నగర్: ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పారా క్వాట్ కలుపు మందును రాష్ట్రంలో పూర్తిగా నిషేధించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ తెలిపారు. జీ.ఓ. నం.24 ప్రకారం ఏప్రిల్ 1 నుంచి నిల్వ, విక్రయం, రవాణా, వినియోగం చట్టవిరుద్ధమన్నారు. ఇది ప్రమాదకర రసాయనం కావడంతో ప్రాణాపాయం, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదం ఉందని హెచ్చరించారు.