VKB: తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటామని పరిగి మున్సిపల్ ఛైర్పర్సన్ రజిత వెంకటేష్ తెలిపారు. ‘ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గురువారం 16వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు.