నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ ప్రాంతంలో బాలికలను అపహరించి అత్యాచారయత్నం చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణానికి చెందిన అబ్బాస్ ఖాన్, షేక్ ఖలీమ్లను నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్ ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ఫోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.