MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని డీసీహెచ్ఎస్ డాక్టర్ కోటేశ్వర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని విభాగాల వార్డులు, లేబర్ రూమ్లు, ల్యాబ్, డయాలసిస్ సెంటర్, రికార్డులు పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు అందిస్తున్న భోజనంపై ఆరా తీశారు. రోగులకు సరైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు.