KMRD: కలెక్టరేట్లో ఈనెల 20న MP సురేశ్ కుమార్ షెట్కార్ ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు DRDO సురేందర్ తెలిపారు. జిల్లాకు చెందిన శాసనసభ్యులు, జిల్లా అధికారులు హాజరు కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు అవుతున్న అభివృద్ధి పథకాలపై సమీక్ష నిర్వహించనున్నారు.