ASF: బెజ్జూర్ మండలం అటవీ ప్రాంతాల్లో మహారాష్ట్ర నుంచి వచ్చిన తల్లి పులి, పిల్ల పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామాల వైపు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. బుధవారం ఫారెస్ట్ అధికారి జగన్ విడుదల చేసిన ప్రకటనలో రాత్రివేళ బయటకు వెళ్లవద్దని, పశువులను భద్రంగా ఉంచాలని, అడవిలో ఒంటరిగా వెళ్లకూడదని సూచించారు.