PDPL: ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని ధర్మారం ఆదర్శ పాఠశాలలో విద్యార్థులు గురువారం ‘ఫుడ్ ఫెస్టివల్’ను ఘనంగా నిర్వహించారు. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు మక్కగడ్క, జొన్న అంబలి, గారెలు వంటి తెలంగాణ ప్రత్యేక వంటకాలను ప్రదర్శించి, వాటి పోషక విలువలను వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లపై అవగాహన పెరుగుతుందన్నారు.