MBNR: జడ్చర్ల బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం 42 మంది రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్మకానికి తెచ్చారు. 1,502 క్వింటాళ్ల మొక్కజొన్న అమ్మకానికి రాగా, గరిష్ఠ ధర రూ. 2,071, కనిష్ఠ ధర రూ. 1,601 లభించింది. మధ్యస్థ ధర రూ. 2,030 పలికింది. ఈ వివరాలను మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఖాజా అలీముద్దీన్ తెలిపారు.