MNCL: తాండూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తహసీల్దార్ జోష్ణ, రెవెన్యూ సిబ్బందితో మాట్లాడారు. ‘భూ భారతి’ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, పెండింగ్లో ఉన్నవాటిని త్వరగా పూర్తి చేయాలని ఆయన సూచించారు.