MBNR: ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన జర్నలిస్టు నరసింహను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మంగళవారం పరామర్శించారు. కార్యక్రమంలో టీడబ్లుజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్, జాతీయ నాయకులు పద్మనాభరావు తదితరులు పాల్గొన్నారు.