NLG: కొత్తపల్లిలో దాదాపు రూ.1:50 లక్షల వ్యయంతో నిర్మించిన మంచి నీటి ట్యాంకు నిరుపయోగంగా ఉంది. ప్రజల దప్పిక తీర్చుకునేందుకు పదేళ్ల క్రితం ఈ ట్యాంకు నిర్మించారు. కృష్ణా జలాల పైప్ లైన్ కూడా ఏర్పాటుచేసి నీటి సరఫరా చేశారు. అనంతరం నీటి సరఫరా లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. అధికారులు చొరవ తీసుకొని ఆట్యాంకులోకి నీరు సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.