KNR: శంకరపట్నం మండలం కన్నాపూర్లో సోమవారం పౌరహక్కుల దినోత్సవం నిర్వహించనున్నట్లు ఎమ్మార్వో సురేఖ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాల్లో కుల వివక్ష, అస్పృశ్యత, అంటరానితనం నిర్మూలన గురించి అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. మండల పరిధిలోని వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, పాల్గొనున్నట్లు తెలిపారు.