మన్యం: నకిలీ కుల ధ్రువపత్రాలపై విచారణ చేపట్టాలని ఆదివాసీ హక్కుల సాధన ఐక్య సంఘాల కార్యాచరణ సమితి(ఏజేఏసీ) నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లాలోని ఆదివాసీ సామాజిక భవనంలో అధ్యక్షుడు ఎన్.జయరాజు ఆధ్వర్యంలో ఆదివాసీలతో సమావేశాన్ని నిర్వహించారు. ఏజేఏసీ అధ్యక్షుడు కె.దర్మారావు మాట్లాడుతూ.. జిల్లాలో 250 నకిలీ కుల ధ్రువపత్రాలు రద్దు చేయాలి అన్నారు.