NRML: నర్సాపూర్ మండలం రాంపూర్లోని ఓ పాఠశాలను ఆదివారం మండల విద్యాధికారి సాయన్న సందర్శించారు. పాఠశాలలోనే పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నట్లు ఆయన గుర్తించారు. తక్షణమే ఈ విక్రయాలను నిలిపివేయాలని పాఠశాల యాజమాన్యాన్ని ఎంఈఓ ఆదేశించారు. విక్రయాలు జరుగుతున్న గదిని సీజ్ చేశారు. పాఠశాలల్లో పుస్తకాల విక్రయం నిబంధనలకు విరుద్ధమని ఎంఈఓ స్పష్టం చేశారు.