VZM: సార్వత్రిక ఎన్నికలలో చంద్రబాబు ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను విస్మరించారని విజయనగరం మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి విమర్శించారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఏడాది పాలనలో ప్రజా ప్రయోజనాలు ఏమీలేవని, కేవలం వైసీపీ నేతలను, పార్టీ క్యాడర్ను భయబ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలే చేశారని మండిపడ్డారు.