WGL: మహబూబాబాద్ నుంచి నర్సంపేటకు ఓమ్ని వ్యాన్లో నిషేధిత గుట్కా, అంబర్ ప్యాకేట్లను తరలిస్తున్న ఓ వ్యక్తిని నర్సంపేట పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి రూ.2 లక్షల విలువ చేసే గుట్కా, అంబర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రవికుమార్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.