TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ రిసార్టులో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. బీబీనగర్ మండలం కొండమడుగు శివారులోని రిసార్టులో ప్రేమికులిద్దరు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.