SRPT: సంస్కృత భాషలో తొలి కావ్యమైన రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి ఆదికవి అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి దొంగ నుంచి ఆదికవిగా మారాడన్నారు.