నల్గొండ పట్టణంలోని పాతబస్తీలో ప్రమాదాల నివారణకు మున్సిపల్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలతో ప్రధాన కూడళ్లు, అంతర్గత రహదారులపై స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పనులు చేస్తున్నామని, మరిన్ని రక్షణ చర్యలు చేపడతామని మేయర్ చైతన్య రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.