NLG: విద్యార్థులు చట్టాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి కే. అనిత అన్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మంగళవారం దేవరకొండలోని ముదిగొండ ఆశ్రమ పాఠశాలను సందర్శించి ఆమె మాట్లాడారు. విద్య ద్వారా మహిళలు ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నారు. సరైన మౌలిక వసతులు, రక్షణ కల్పించాలని అధికారులను ఆదేశించారు.