KNR: సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైతు మహోత్సవం’లో ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు, బూజునూర్, మాల్యాల క్లస్టర్ రైతులు వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో బయలు దేరారు. కొత్త ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ సందర్శనతో పాటు, ఆధునిక వ్యవసాయ పద్ధతుల స్టాల్స్లో యంత్రాలపై శాస్త్రవేత్తల ద్వారా అవగాహన పెంచుకునేందుకు రైతులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.