MDK: శీతాకాలంలో రహదారులపై వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా పరిధిలో శీతాకాలం తీవ్రత, ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు పేరుకు పోవడం వల్ల రహదారులపై ముందు ఉన్న వాహనాలు కనిపించకపోవడం వలన ప్రమాదలు జరిగే ప్రమాదం ఉందన్నారు. ఈ సమయంలో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.