HYD: వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి సందర్భంగా కేపీహెచ్బీ కాలనీలోని టెంపుల్ బస్టాప్ వద్ద వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బడుగు బలహీనవర్గాలకు ఆయన చేసిన సేవలు మరువలేనివని MLA కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లో మరువని నేతగా చరిత్రలో నిలిచిపోయారన్నారు.