WGL: రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతుందని పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి అన్నారు. 15, 16, 17వ డివిజన్లకు చెందిన 50 మంది మైనార్టీ మహిళలకు ఎమ్మెల్యే కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. కుట్టు మిషన్లు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయని ఎమ్మెల్యే అన్నారు.