ADB: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ పేర్కొన్నారు. గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు పీరాజీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు గజేందర్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.