జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన సుమారు 3.17 ఎకరాల ఎండోమెంట్స్ భూమిని రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ మంత్రి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్లకు వినతి పత్రం అందజేశారు. సర్వే నంబర్ 1492లో ఉన్న ఈ భూమి ఎండోమెంట్స్ శాఖ పరిధిలో ఉందని ఎమ్మెల్యే తెలిపారు.