NLG: దేవరకొండలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ గత రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న రూ. 4500 కోట్లను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆర్డీఓకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.