RR: నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయ అధికారి జయశ్రీ తెలిపారు. మల్లేపల్లిలోని ఉపాధి కార్యాలయం ఐటీఐ క్యాంపస్లో జాబ్ మేళా జరుగుతుందన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, పూర్తి చేసి 18-30 సంవత్సరాలలోపు వారు అర్హులన్నారు.