మహబూబ్ నగర్: నవాబుపేట మండలం మాజీ కోఆప్షన్ సభ్యుడు ఖాజా మైనుద్దీన్ కుటుంబాన్ని జడ్చర్ల మాజీ శాసనసభ్యులు డాక్టర్ లక్ష్మారెడ్డి మంగళవారం పరామర్శించారు. ఖాజా మైనుద్దీన్ ఇటీవల మరణించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీకి ఖాజా మైనుద్దీన్ ఎనలేని సేవలు అందించారని వెల్లడించారు.