NRML: రాబోయే గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం వద్ద భక్తుల రద్దీ దృష్ట్యా ఘాట్లు, తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ వంటి సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు. సోమవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లపై సమీక్షించారు.