PDPL: ధర్మారం మండలం నరసింహులపల్లిలో కుమ్మరికుంట శంకరయ్య (73) అనే వ్యక్తి బుధవారం రాత్రి ఇంటిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. 6 నెలల క్రితం శంకరయ్య సైకిల్ పైనుంచి పడగా కాలులో రాడు వేశారు. రాడు నొప్పి భరించలేక, జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడని, కుమారుడు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.