KMR,:నిజాంసాగర్ మండలంలో నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఈనెల 13వ తేదీన నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాంబాబు తెలిపారు.మొత్తం 5124 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు అప్లై చేసుకున్నారని వెల్లడించారు. వారికోసం ఉమ్మడి జిల్లాలో 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.