HYD: గణేశ్ మహా నిమజ్జనం సందర్భంగా జీహెచ్ఎంసీ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిర్విఘ్నంగా స్వచ్ఛత కార్యక్రమాలు చేపడుతున్నారు. నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో చెత్త, పూలమాలలు, కలర్ పేపర్స్, ఇతర వ్యర్థాలను తక్షణమే తొలగిస్తూ, పారిశుద్ధ్యాన్ని కాపాడుతున్నారు. 15 వేల మంది సానిటేషన్ సిబ్బంది 24×7 విధుల్లో ఉండగా, అధికారులు స్వయంగా పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు.