NRML: వినియోగదారుల హక్కులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఆయన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు.