ADB: గుడిహాత్నూర్ మండలంలోని సీనియర్ నాయకులు బాలాజీ పటేల్, మాజీ ఎంపీటీసీ అంకాతి సమక్షంలో ఆదివారం కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీ బోథ్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.