JGL: కొడిమ్యాలలో అభివృద్ధి పనులకు సహకరిస్తానని చొప్పదండి ఎమ్మెల్యే సత్యం అన్నారు. మండల కేంద్రంలోని పోచమ్మ ఆలయం ప్రతిష్ఠాపానలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శివాలయానికి అవసరమైన గ్రానైట్ ఇస్తానని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఓ విద్యా సంస్థ అధినేత నరేందర్ రెడ్డి, పెద్దఎత్తున మహిళలు, పాల్గొన్నారు.