MNCL: మంచిర్యాలలో మంగళవారం సీపీఐ పట్టణ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు మాట్లాడుతూ.. దేశంలో పెట్రెగిపోతున్న మతోన్మాద శక్తులు, హింసకు వ్యతిరేకంగా ప్రజలందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం పట్టణ నూతన కార్యదర్శిగా కలిందర్ అలీ ఖాన్, సహాయ కార్యదర్శిగా చాడ మహేందర్ రెడ్డిని ఎన్నుకున్నారు.