NLG: నిరుపేదల సొంత ఇంటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని 42వ డివిజన్ కార్పొరేటర్ నాగలక్ష్మి అన్నారు. శుక్రవారం గొల్లగూడకు చెందిన కేదారమ్మ ఇంటి నిర్మాణానికి ఆమె భూమి పూజ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో డివిజన్లోని అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.