BHPL: జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా అధికారులు కృషి చేయాలని MLA గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. శనివారం HNK కలెక్టర్ కార్యాలయంలో MP కావ్య అధ్యక్షతన జరిగిన దిశ సమావేశంలో MLA పాల్గొన్నారు. శాయంపేట మండలంలోని ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలల్లో టాయిలెట్ల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.