KMR: పల్వంచ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ హిమబిందు ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అధికారులు ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.